వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం జోక్యానికి జెఎసివిజ్ఞప్తి
హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమ్మె పరిష్కారానికి ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవాలని సింగరేణి కార్మిక సంఘాలసంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులుకోరారు. తమ డిమాండ్ల సాధన కోసం సింగరేణి బొగ్గు గనుల కార్మికులు సమ్మెకుదిగిన విషయం తెలిసింది. సింగరేణి కార్మికుల సమస్యలకున్యాయబద్ధమైన, హేతుబద్ధమైన పరిష్కారం కనుక్కోవాలని జెఎసినాయకుడు పొట్లూరి నాగేశ్వరరావు గురువారం విలేకరులసమావేశంలో విజ్ఞప్తి చేశారు.
కార్మికుల సమ్మెపై ప్రభుత్వందుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. సింగరేణి సమ్మెపీపుల్స్వార్ ప్రమేయంతో జరుగుతోందనే ప్రభుత్వవిమర్శను ఆయన ఖండించారు. కార్మికులు సమ్మెనునిలిపేయడానికి ప్రభుత్వం సానుకూలం ప్రయత్నంచేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Story first published: Thursday, June 14, 2001, 23:53 [IST]