వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేర్పాటువాదం ప్రభుత్వాల పుణ్యమే

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణాలోని ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే 610 జివో అమలులో నిర్లక్ష్యమే వేర్పాటువాద ధోరణులకు కారణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ఈ విమర్శ చేశాయి. 610 జివో అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలేవీ శ్రద్ధ చూపలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు.

ఉత్తర్వులు విడుదలై దశాబ్దాలు గడిచినా అమలు చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వు 1985లో జారీ అయిందని, ఆ తర్వాత కాంగ్రెస్‌ కూడా అధికారంలోకి వచ్చిందని, అటు కాంగ్రెస్‌ గానీ, ఇటు తెలుగుదేశం గానీ అధికారాల్లో వున్నప్పుడు ఈ ఉత్తర్వు అమలు పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించలేదని, ఈ కారణంగా వేర్పాటువాద ధోరణి ప్రబలుతోందని ఆయన అన్నారు. జీవో అమలులో లోపాలను సరిదిద్దాల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో బి.వి. రాఘవులుతో పాటు వి. పురుషోత్తమరెడ్డి, డాక్టర్‌ కె. కేశవరావు (కాంగ్రెస్‌), డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ (బిజెపి), అసదుద్దీన్‌ ఓవైసీ (మజ్లీస్‌), రావుల చంద్రశేఖరరెడ్డి, లాల్‌ జాన్‌ బాష (టిడిపి), తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X