వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చల్లో మేం తప్పనిసరి: హురియత్
శ్రీనగర్: తమ ప్రమేయం లేకుండా కాశ్మీర్ సమస్యపై పాకిస్థాన్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషర్రాఫ్కు, భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి మధ్య జరిగే చర్చలు ఫలవంతం కావని ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ అభిప్రాయపడింది. ఉభయ దేశాల అధినేతల మధ్య జరిగే చర్చల విషయంలో అనుసరించాల్సిన విధానంపై ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ ఒక నిర్ణయానికి రాలేకపోయింది.
కాశ్మీరీ ప్రజలకు ప్రాతినధ్యం వహిస్తున్న తమ జోక్యం ఉభయ దేశాల అధినేతల మధ్య జరిగే చర్చల్లో తప్పని సరి అని ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు అబ్దుల్ ఘనీ భట్ అన్నారు. 23 గ్రూప్లతో కూడిన ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ భారత, పాక్ల మధ్య చర్చల్లో తాము కూడా తప్పనిసరిగా వుండాల్సిందేనని వాదిస్తోంది.
Comments
Story first published: Friday, June 15, 2001, 23:53 [IST]