వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు స్టేషన్పై వార్ దాడి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్పై ఆదివారం వేకువజామున పీపుల్స్వార్ నక్సలైట్లు దాడి జరిపారు. ఈ సందర్భంగా పోలీసులకు నక్సలైట్లకు మధ్య నాలుగుగంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.
కాగా ఏడుగురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పోలీసు స్టేషన్పై దాడి చేసిన నక్సలైట్లు ఆయుధాలు వదిలి పారిపోవల్సిందిగా హెచ్చరించినట్టుగా పోలీసులు చెప్పారు. నక్సలైట్ల హెచ్చరికను ఖాతరు చేయకుండా పోలీసులు ఎదురుదాడికి దిగడంతో పాటు అదనపు బలగాల కోసం సమాచారం పంపారు. పరిస్థితి ఎదురుతిరిగినట్టుగా కనిపించడంతో నక్సల్స్ పారిపోయారు.
Comments
Story first published: Sunday, June 17, 2001, 23:53 [IST]