కేరళలో రైలుప్రమాదం-56 మంది మృతి
త్రివేండ్రం:
కేరళలోని
కోజికోడ్
వద్ద
శుక్రవారం
సాయంత్రం
జరిగినఘోర
రైలు
ప్రమాదంలో
56
మంది
మరణించినట్లురైల్వే
అధికారులు
ప్రకటించారు.
మరో
100
మంది
గాయపడ్డారని
వారు
తెలిపారు.పరప్పనంగడి,
కాలికట్ల
మధ్య
మంగుళూర్-
మద్రాసు
మెయిల్
మూడు
బోగీలు
శుక్రవారం
సాయంత్రం
కదలుండి
నదిలో
పడిపోగా,
మరో
మూడు
బోగీలు
పట్టాలు
తప్పాయి.
ౖ
రెలు
నదిని
దాటుతుండగా
సాయంత్రం
ఐదు
గంటల
ప్రాంతంలో
ఈ
ప్రమాదం
సంభవించింది.
ఆ
సమయంలో
భారీ
వర్షంకురుస్తోందని
రైల్వే
వర్గాలు
చెప్పాయి.
నదిలోపడిపోయిన
బోగీల్లో
ఒకటి
పూర్తిగా
మహిళలకు
కేటాయించింది.
ఒక
బోగీ
జనరల్
కంపార్ట్మెంట్.
కాలికట్
నుంచి
ఫైర్
టెండర్స్
సంఘటనా
స్థలానికి
చేరుకున్నాయి.
గాయపడిన
50
మందిని
కజికోడ్
వైద్య
కళాశాల
ఆస్పత్రికి
తరలించారు.
నదిలో
సమాధి
అయిన
బోగీల్లో
200
మంది
వుంటారని
అంచనా.
నదిలో
గాలింపు
చర్యలు
చేపట్టారు.
ప్రమాద
స్థలికి
రైల్వే
మంత్రి
నితీష్కుమార్,
రైల్వే
ఉన్నతాధికారులు
చేరుకుని
సహాయక
చర్యలను
పర్యవేక్షిస్తున్నారు.
ఈ
దుర్ఘటన
పట్ల
రాష్ట్రపతి
కె.ఆర్.
నారాయణన్
తీవ్ర
విచారం
వ్యక్తం
చేశారు.
మృతులకు
సంతాపం
ప్రకటించారు.