వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఐటి కంపెనీపై ఉద్యోగుల కేసు

By Staff
|
Google Oneindia TeluguNews


న్యూఢిల్లీ : న్యూయార్క్‌ ప్రాధాన కేంద్రంగా గల ఇన్నోడాటా ఐటి కంపెనీ తన ఉద్యోగులను ఉన్నట్టుండి తొలగించటంతో కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యోగులు కేసుపెట్టినట్టు ఒక ఆంగ్ల దినపత్రిక తన శుక్రవారం నాటి సంచికలో పేర్కొంది. సంస్ధలో పనిచేసే 450 మంది ఉద్యోగులను ఉన్నట్టుండి బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బుధవారం అర్ధరాత్రి 450మంది డేటా ఆపరేటర్లను 10 బ్యాచ్‌లుగా పిలిపించి తక్షణం రిజైన్‌ చేయాల్సిందిగా కంపెనీ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్‌ ఎస్‌.కె.రొహిల్లా బలవంతం చేశారని ప్రవీణ్‌ కుమార్‌ అనే డేటా ప్రాసెసర్‌ తెలిపాడు. మల్టీనేషనల్స్‌ వై-2-4 ప్రాజెక్టుకోసం వందలాదితోపాటు కుమార్‌ ఈ సంవత్సరం మే 21న కంపెనీలో చేరాడు. ఈప్రాజెక్టుపని కుంటుపడటంతో కంపెనీ తక్షణం 362 మంది ఉద్యోగులను తొలగించి, మరో 438 మందిని తొలగించేందుకు ప్రయత్నిస్తూవుంది. ఇన్నోడాటా కంపెనీకి మనీల, న్యూజెర్సీ, కొలంబో, ఇండియాలలో యూనిట్లు వున్నాయి.

తమను ఉద్యోగాలనుండి తొలగించాన్ని ప్రతిఘటించినందుకు మహిళా ఉద్యోగులను సైతం క్యాబిన్‌లో బంధించి వేధించినట్టు కుమార్‌ తెలిపాడు.కాగా, పోలీసులు ఉద్యోగుల ఫిర్యాదుపై తగు రీతిలో స్పందించలేదు. ఎలాంటి ఫిర్యాదు లేకుండానే ఆరుగురు
ఇన్నోడాటా ఉద్యోగులను అక్రమంగా స్టేషన్‌లో నిర్భంధించినట్టు ఆ వార్త పేర్కొంది. కంపెనీ ఉద్యోగులు హింసకు దిగటంతో ఇలా చేయాల్సివచ్చిందని పోలీసులు అంటున్నారు. కంపెనీ అధికారులు అందుబాటులో లేరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X