వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 197 కోట్లతోమంచినీటి ప్రాజెక్టులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోనిఎనిమిది జిల్లాల్లో మంచినీటి కొరతతీర్చేందుకు ప్రభుత్వం శుక్రవారంనాడు 197 కోట్లరూపాయలు ఖర్చు కాగల 12 ప్రాజెక్టులను ఆమోదించింది.ఇందులో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 147 కోట్లరూపాయలు విడుదల చేస్తుంది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సివుంటుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 1,422 నివాసిత ప్రాంతాలకు రక్షితమంచినీటిని అందిస్తారు. ఇందులో 480 ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలుకాగా, మిగతా 441 బ్రాకిష్‌ వాటర్‌తో నిండినగ్రామాలు.

ఈ ప్రాజెక్టులను కృష్ణా జిల్లాలోనిదీవిసీమ (రూ.95 లక్షలు), గన్నవరం (రూ.727లక్షలు), శ్రీకాకుళం జిల్లాలోని వంశధార (రూ.470లక్షలు), ఉద్దానం (రూ.2140 లక్షలు), నెల్లూరు జిల్లాలోని సూల్లూరుపేట (రూ.1898లక్షలు), ఉదయగిరి (రూ.688 లక్షలు), ప్రకాశం జిల్లాలోనికందుకూరు (రూ. 309 లక్షలు), రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్‌, ఘట్కేసర్‌(రూ. 796 లక్షలు), గుంటూరు జిల్లాలోని తాడికొండ(రూ. 204 లక్షలు), ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి(రూ. 2423 లక్షలు), మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేట(రూ. 3712 లక్షలు) కర్నూలు జిల్లాలోని నంద్యాల (రూ. 6200లక్షలు)లలో అమలు చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X