వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరోసారి ఉమర్పై హత్యాయత్నం
శ్రీనగర్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల సహాయ మంత్రి ఉమర్ అబ్దుల్లా రెండవసారి హత్యాప్రయత్నం నుంచి బయట పడ్డారు. శనివారం నాడు ఆయనపై రెండోసారి మిలిటెంట్లు హత్యాప్రయత్నం చేశారు. ఈ నెలలోనే ఆయనపై ఇంతకు ముందు హత్యాప్రయత్నం జరిగింది. సోఘంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్పై మిలిటెంట్లు గ్రెనేడ్లు పేల్చారు. మిలిటెంట్లు గురి తృటిలో తప్పి ఆయన ప్రమాదం నుంచి బయట పడ్డారు.
ఉమర్ అబ్దుల్లా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడు. మిలిటెంట్ల దాడి జరిగినప్పుడు ఆయన వెంట మంత్రి ముస్తాక్ అహ్మద్ లోనె వున్నారు. గత నెలలో ఉమర్ అబ్దుల్లాపై నవకడాల్ వద్ద గ్రెనేడ్ దాడి జరిగింది. సోఘంలో హెలికాప్టర్ దిగుతుండగా మిలిటెంట్లు శనివారంనాడు మూడు రైఫిల్ గ్రెనేడ్లు పేల్చారు. అవి గురి తప్పడంతో ఉమర్ అబ్దుల్లా అపాయం నుంచి బయట పడ్డారు.
Story first published: Saturday, June 23, 2001, 23:53 [IST]