వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచిత విద్యుత్‌ సాధ్యమే

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శృతిమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. అన్నీ ఆలోచించిన మీదటే ఈ అంశంపై తాము స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టుగా కాంగ్రెస్‌ ప్రకటించింది.

రైతులకు ఉచిత విద్యుత్‌ సాధ్యమనే వాదనకు తాము ఇప్పటికీ కట్టుబడే వున్నామని కాంగ్రెస్‌ ప్రతినిధి రోశయ్య పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల వత్తిడి కారణమో లేక, విజయావకాశాలు అంతంత మాత్రమేనని నివేదికలు అందుతున్నయో తెలియదుగానీ ముఖ్యమంత్రి ఈ మధ్య అకారణంగా ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారని రోశయ్య వ్యాఖ్యానించారు. నదీజలాలు అందుబాటులోలేని ప్రాంతాల రైతులకు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్నది కాంగ్రెస్‌ అభిప్రాయమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X