వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ ప్రభావంపై అప్రమత్తం: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో నక్సల్స్‌ ప్రభావం లేకుండా చూస్తామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) హెచ్‌.జె. దొర శుక్రవారం చెప్పారు.

ఎప్పుడూ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చే నక్సలైట్లు ఈసారి ఆ పిలుపు ఇవ్వకపోవడమే కాకుండా కొన్ని పార్టీలకు మద్దతు ప్రకటించారని, ఈ మద్దతు ఏ రూపంలో వుంటుందో చూడాలని ఆయన అన్నారు. కేవలం పిలుపు నిచ్చి మిన్నకుంటే ఫరవా లేదు కానీ ఓటర్లను భయపెడితే, భయానక వాతావరణం సృష్టిస్తే జోక్యం చేసుకుంటామని ఆయన అన్నారు. ఒక సంస్థనో, ఒక పార్టీనో దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా అనడం లేదని ఆయన అన్నారు.

ఎన్నికల భద్రత కోసం లక్షా పది వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. సీనియర్‌ ఎన్‌సిసి విద్యార్థులను కూడా వాడుకుంటామని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి 30 కంపెనీల పారా మిలటరీ బలగాలను కూడా తెప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X