వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హింసకు దిగుతున్న దేశం: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: తెలంగాణా ఓటమి భయంతో తెలుగుదేశం తమ కార్యకర్తలపై, నాయకులపై దాడులకు దిగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు (కెసిఆర్‌) ఆరోపించారు. తెలుగుదేశం హింసకు దిగడాన్ని ఆయన శుక్రవారం ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్‌ రూరల్‌ ఎంపిటిసి అభ్యర్థి సాయినాథ్‌పై గురువారం రాత్రి హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన తీవ్రంగాగాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం చంద్రశేఖర్‌ సాయినాథ్‌ను పరామర్శించారు. సాయినాథ్‌పై జరిగిన హత్యాప్రయత్నానికి తెలుగుదేశం బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

తెలుగుదేశం దాడులకు పాల్పడుతూ హింసకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఈ విషయమై గవర్నర్‌ రంగరాజన్‌కు వినతి పత్రం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. సాయినాథ్‌ను కత్తులతో పొడిచి హత్య చేయాలని ప్రయత్నించడం అరాచకం, అప్రజాస్వామికమని, ఇది రాజకీయాల్లో వాంఛనీయం కాదని ఆయన అన్నారు.

తెలుగుదేశం ఏ రోజూ హింసను ప్రోత్సహించదని మంత్రులు మండవ వేంకటేశ్వరరావు, పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సాయినాథ్‌పై జరిగిన హత్యా ప్రయత్నంతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X