వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హురియత్‌ నేతలతో 14న ముషారఫ్‌ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: భారత ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతర పెడుతున్నప్పటికీ హురియత్‌ నేతలతో పాకిస్తాన్‌ అధిపతి ముషారఫ్‌ సమావేశమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్‌లో అధికార పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్న జులై 14వ తేదీనే ఆయన హురియత్‌ నేతలతో మంతనాలు జరిపే అవకాశం వుంది.

హురియత్‌ నేతలతో అధికారికంగా కాకుండా ఢిల్లీలోని పాకిస్తాన్‌ రాయబారి ఖాజీ తన గౌరవార్ధం ఇచ్చే విందులో ముషారఫ్‌ మాట్లాడుతారని అంటున్నారు. పాకిస్తాన్‌ హైకమిషన్‌ విందుకు ఎవరిని పిలవాలనేది పూర్తిగా కమిషన్‌ యిష్టమని పాక్‌వర్గాలు అంటున్నాయి.
ముషారఫ్‌, వాజ్‌పేయిల శిఖరాగ్ర సమావేశానికి ముందు ఇద్దరు నేతలతో సమావేశమై కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చ జరిపే అవకాశం తమకు కల్పించాలని హురియత్‌ నేతలు పాకిస్తాన్‌, భారత ప్రభుత్వాలను కోరారు. అయితే
భారత్‌ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పాకిస్తాన్‌ అధికారికంగా ఏమీ ప్రకటించనప్పటికీ విందులోనే హురియత్‌ నేతల వాదనను ముషారఫ్‌ ఆలకించే అవకాశం వున్నదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X