వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారంలోకి వస్తే ఉచితవిద్యుత్‌ః వై.ఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌ః స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రచారపర్వాన్ని ఆదివారం మధ్యాహ్నం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నుంచి ప్రారంభించింది. పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు, సి.ఎల్‌.పి. నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ఉమ్మడిగా స్థానికసంస్థల తొలి ప్రచారసభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎం.సత్యనారాయణ రావు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఏ మాత్రం పనికిరాని పథకాలతో ప్రజలను మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని ఎమ్మెస్సార్‌విమర్శించారు.

వె.ఎస్‌. రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకివిజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మూన్నాళ్ళ ముచ్చటేనని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం రైతులకు ఉచితంగావిద్యుత్‌ సరఫరా చేస్తామని వాగ్దానం చేశారు.

కాంగ్రెస్‌ కబుర్లు నమ్మకండిః బాబు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X