తమిళనాడు గవర్నర్ ఫాతిమా రీకాల్
చెన్నయ్ః తమిళనాడులో శని, ఆదివారాలలో జరిగిన అనూహ్య పరిణామాల నేపధ్యంలో గవర్నర్ ఫాతిమా బీవిని రీకాల్ చేయాలని కేంద్రక్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రపతికె.ఆర్. నారాయణన్ కు తమిళనాడు గవర్నర్ ను రీకాల్ చేయాల్సిందిగా కోరాలని కేంద్రక్యాబినెట్ అత్యవసర సమావేశం ఆదివారం నిర్ణయించింది.
కరుణానిధి అరెస్టు, ఇద్దరు కేంద్ర మంత్రులఅరెస్టుల పర్వంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్ నుంచిఅందిన నివేదికలను పరిశీలించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆదివారం మధ్యాహ్నం సమావేశమైంది. రెండు నివేదికలను పరిశీలించిన అనంతరం గవర్నర్ ఫాతిమా బీవిని రికాల్ చేయాలని ప్రధాని వాజ్పేయి సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ తీర్మానించింది. ఫాతిమా బీవి నివేదిక రాష్ట్రంలోని పరిస్థితులను ఏ మాత్రం ప్రతిబింబించేదిగా లేదని కేంద్ర క్యాబినెట్ అభిప్రాయపడింది. జయలలితకు ఫాతిమాబీవి క్లీన్ చిట్ కూడా ఇవ్వడంతో కేంద్ర క్యాబినెట్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
తమిళనాడు గవర్నర్ రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో పూర్తిగావిఫలం ఆయ్యారని కేంద్ర క్యాబినెట్ అభిప్రాయపడింది. ఇటీవలఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయను కేంద్ర ఎన్నికల సంఘం అనర్హురాలిగా ప్రకటించింది. అయితే ఆమె పార్టీవిజయభేరి మోగించడంతో గవర్నర్ ఫాతిమా బీవి జయలలితను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించివివాదాల్లోకి ఎక్కారు. పక్షపాత ధోరణితో వ్యవహరించిన ఫాతిమా బీవిని రీకాల్ చేయాలంటూ డిఎంకెతో పాటు మరి కొన్ని పార్టీలు కూడాఅప్పట్లోనే డిమాండ్ చేశాయి.
తాజా పరిణామాల నేపధ్యంలో ఫాతిమాబీవిని అక్కడ కొనసాగించరాదని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రపతికె.ఆర్. నారాయణన్ కు ఫాతిమాను రీకాల్ చేయాల్సిందిగా సిఫారసు చేయాలని నిర్ణయించారు.
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
-
కరుణానిధి
అరెస్టుః
జైలుకు
తరలింపు