అంతా సన్ టీవి మాయః జయ
చెన్నయ్ః కరుణానిధినిఅరెస్టు చేయడంలో పోలీసుల వైఖరిని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమర్థించారు. కరుణానిధి ప్రతిఘటించడంతోస్వల్ప పెనుగులాట జరిగిందని, సన్ టీవి దానిని భూతద్దంలో చూపిందని జయ శనివారం రాత్రి విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలో వెల్లడించారు. అంతకు ముందు రాత్రి 8 గంటలకువిలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జయ దానిని రద్దు చేశారు. ఆ తరువాత కరుణఅరెస్టుపై ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని వాజ్ పేయి తనతో మాట్లాడేందుకు ప్రయత్నించలేదని ఆమె స్పష్టం చేశారు. వాజ్పేయి నేరుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ తో మాట్లాడారని, తనతో మాట్లాడేందుకు ప్రధాని ప్రయత్నించివిఫలం అయ్యారనడం నిజం కాదన్నారు. తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో వున్నదని, అటువంటప్పుడు రాష్ట్రపతి పాల ఎలా విధిస్తారని జయ ప్రశ్నించారు. కరుణానిధి, స్టాలిన్ పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని,అందుకే పోలీసులు వారిని అరెస్టు చేశారని జయ చెప్పారు. వారినిఅరెస్టు చేసినప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి శాంతిభద్రత సమస్య తలెత్తలేదన్నారు.
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
-
కరుణానిధి
అరెస్టుః
జైలుకు
తరలింపు