వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉయ్యూరు ఎమ్మెల్ల్యే బాబూరావు మృతి
విజయవాడః కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎమ్మెల్ల్యే అన్నే బాబూరావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు.
ఆయన వయస్సు 63 సంవత్సరాలు. గత మూడు సార్లుగా ఆయన తెలుగుదేశం టిక్కెట్టుపై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు నెలలుగా అస్వస్థతతో వున్న బాబూరావు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు.
గతంలో విద్యుత్ బోర్డు ఉద్యోగిగా పనిచేసి ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన బాబూరావు అజాతశత్రువుగా పేరుపొందారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. అన్నే బాబూ రావు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.
Comments
Story first published: Sunday, July 1, 2001, 23:53 [IST]