వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని శాఖలకుఇ-మెయిల్‌: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే 2002నాటికి ప్రభుత్వ శాఖలన్నింటినీ కంప్యూటరీకరించునన్నట్లు ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు చెప్పారు. మంగళవారం నాడిక్కడ జరిగిన ఒకసదస్సులో ఆయన ప్రసంగించారు. అన్ని శాఖలు కంప్యూటర్లను సమీకరించుకునివాటిని వాడడం ప్రారంభించాలని ఆయన వివిధ ప్రభుత్వ శాఖలకార్యదర్శులను ఆదేశించారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీని ఎంత ఎక్కువగాఉపయోగించుకుంటే అంత అభివృద్ధి సాధించగలమనిఆయన అన్నారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ వాడకం ద్వారావిజన్‌ 2020 లక్ష్యాలను సాధించడం, పారదర్శకత పాటించడం సులభమవుతుందనిఆయన అన్నారు.

ఆన్‌లైన్‌ ప్రారంభానికి ముందుఅన్ని ప్రభుత్వ శాఖలు ఇ-మెయిల్ను వాడుకోవడంఅలవాటు చేసుకోవాలని, ప్రతి శాఖకు ఇ-మెయిల్‌ఉండాల్సిందేనని ఆయన అన్నారు. తద్వారాఇ-గవర్నెన్స్‌కు సమాయత్తం కావాలని ఆయన అన్నారు. ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా సమాచారాన్నిఅందిస్తామని, దీన్ని మండల స్థాయి వరకువాడుకునేలా సమాయత్తం కావాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X