బెయిలు వద్దంటున్న కరుణానిధి
చెన్నయ్ః తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి బెయిలుకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని నిర్ణయించుకున్నారు. కరుణానిధి సతీమణి దయాళు అమ్మాల్ మంగళవారం ఈవిషయాన్ని వెల్లడించారు. జైలులోనే వుండి న్యాయపోరాటం సాగించాలని కరుణానిధి నిర్ణయించుకున్నారంటూ వార్తలు వెలువడినవిషయం విదితమే.
ఆయితే కరుణానిధి ఆరోగ్యం బాగాలేదని వైద్యులు చెబుతున్నారు. కరుణానిధి వ్యక్తిగత వైద్యుని జైలు అధికారులు అనుమతించలేదంటూ కరుణ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కరుణానిధి కాళ్ళు వాచాయని, రక్తపోటు తీవ్రంగా వున్నదని మంగళవారం జైలులో కరుణను పరామర్శించిన ఆయన భార్య, కుమార్తె చెప్పారు.
కరుణను అరెస్టు చేసే సమయంలో జరిగిన తొక్కిసలాటలో కరుణ భుజం బెణికిందని, ఆయన తీవ్రమైన మానసికి ఒత్తిడితో వున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. కరుణను ఇంటెన్సివ్ కేర్ విభాగంలో వుంచి చికిత్స చేయాల్సిన అవసరంఎంతైనా వున్నదని ఆయనను పరీక్షించిన వైద్యులు చెప్పారు.
- కరుణను కలిసిన ఎర్రంనాయుడు
- గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
- 3న రంగరాజన్ ప్రమాణ స్వీకారం
- తమిళనాడు బంద్ ప్రశాంతం
- ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు
- జయలలితపై వాజ్ పేయి గరం
- జెలులో కరుణ సత్యాగ్రహం
- కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు