జయ ప్రభుత్వరద్దుకు దేశం వ్యతిరేకం
న్యూఢిల్లీ: తమిళనాడులో రాష్ట్రపతి పాలనవిధించాలనే ప్రతిపాదనను తెలుగుదేశం వ్యతిరేకించనుంది.మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని, కేంద్ర మంత్రులుమురసోలీ మారన్, కె.ఆర్. బాలులను అరెస్టు చేసిననేపథ్యంలో జయలలిత ప్రభుత్వాన్ని రద్దు చేసితమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని జార్జిఫెర్నాండెజ్ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ)బృందం సిఫార్సు చేసింది.
తమిళనాడు ప్రభుత్వాన్నిరద్దు చేయడానికి తాము సుముఖంగాలేమనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధానిఅటల్ బిహారీ వాజ్పేయికి చెప్పినట్లు తెలుస్తోంది.తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినప్పటికీచట్టపరమైన ఏ చర్యకైనా ఆ పార్టీకి చెందిన 29మంది లోక్సభ సభ్యుల మద్దతు అవసరం.
జయలలిత ప్రభుత్వాన్నిరద్దు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వంఉన్నదని, అయితే తెలుగుదేశం మోకాలడ్డుతోందని ఎన్డిఎభాగస్వామ్య పక్షానికి చెందిన నాయకుడొకరుచెప్పారు.
- కరుణను కలిసిన ఎర్రంనాయుడు
- గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
- తమిళనాడు బంద్ ప్రశాంతం
- ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
- ఫాతిమాపై వేటు-రంగరాజన్ కు బాధ్యతలు
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
- నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్
- కరుణను పరామర్శించిన జార్జి
- అట్టుడుకుతున్న తమిళనాడు