వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిడుగురాళ్ళ ప్రమాదంలో ఆరుగురుమృతి
గుంటూరుః గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఆదివారం ఉదయం జరిగినఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో వున్నారు. గాయపడిన వారు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
13 మంది ప్రయాణిస్తున్న జీపు ఎదురుగా వస్తున్న లారీని డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జుఅయింది. ఆరుగురు అక్కడిక్కడే మరణించగా మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కూడా ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా వున్నదని పోలీసులు చెప్పారు.
Comments
Story first published: Sunday, July 8, 2001, 23:53 [IST]