వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచారంతో హోరెత్తుతున్న తెలుగు పల్లెలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఈ నెల 14,16 తేదీల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్ది పల్లెల్లో ప్రచారం హోరెత్తుతున్నది. జడ్‌.పి.టి.సి., ఎంపిటిసి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం పల్లెల్లో వేడి రాజుకున్నది. అన్ని పార్టీలకు చెందిన నాయకులు తమపార్టీ అభ్యర్థులవిజయానికి అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార పర్వంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, సి.ఎల్‌.పి. నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి, టి.ఆర్‌.ఎస్‌. నాయకుడు చంద్రశేఖర రావుల ప్రసంగాల హోరు పరికించండి.

కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రం దివాలాః బాబు
ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ లో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి కరణం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్‌ పార్టీ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రం ఇలా వెనుకబడి పోవడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆయన దుయ్యబట్టారు.

దేశంకు పట్టంకడితే మళ్ళీ ఛార్జీల మోతః వై.ఎస్‌
స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ప్రజలు మళ్ళీ విద్యుత్‌ ఛార్జీల మోత భరించాల్సి వస్తుందని సిఎల్పి నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఓ గుదిబండ తగిలించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సన్నాహాలు చేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. వరంగల్‌ జిల్లాలో జరిగిన వివిధ బహిరంగ సభలలో వై.ఎస్‌. ఆవేశపూరితంగా ప్రసంగించి ప్రజల జయజయధ్వానాలు
అందుకుంటున్నారు.

రాష్ట్రాన్ని అప్పుప ఊబిలోకి నెడుతున్న బాబుః టిఆర్‌ఎస్‌
ఆర్థిక సంస్కరణల పేరుతో రాష్ట్రప్రజలపై మోయలేని అప్పుల భారాన్ని మోపుతున్నారని టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ లో జరిగిన బహిరంగ సభలో చంద్రశేఖర రావు ప్రసంగించారు. ఉపాధి లేకనే తెలంగాణా యువత నక్సలైట్లుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొత్త రాష్ట్రాన్ని కోరడంలేదని, గతంలో వున్న తెలంగాణా రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని మాత్రమే పోరాటం సాగిస్తున్నామని చంద్రశేఖర రావు వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X