ఆగ్రాచర్చల ఫలితంలో పాక్ కు అర్థభాగం
ఇస్లామాబాద్ః భారత్ తో జరిగే శిఖరాగ్రసదస్సు ఫలితానికి తాను సగం మాత్రమే బాధ్యుడినని పాక్ అధ్యక్షుడు జనరల్పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. భారత్ ధోరణి కూడా శిఖరాగ్రసదస్సు సత్ఫలితం సాధించేందుకు తోడ్పడుతుందని అమెరికన్ వాయస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ స్పష్టం చేశారు.
భారత్ అంగీకరిస్తేనే హురియత్ నేతలతోవిందులో పాల్గొంటామని ముషారఫ్ చెప్పారు. వారిని కేవలంవిందుకు ఆహ్వానించారమని, వారితో చర్చలు జరపబోమని ముషారఫ్ తేల్చి చెప్పారు. హురియత్ కారణంగా భారత్ తో చర్చలకు ఎటువంటి విఘాతం కలగబోదని ముషారఫ్ తెలిపారు.
ముషారఫ్ వ్యాఖ్యలతో హురియత్ అంశంపై పాకిస్తాన్ మెత్తబడినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే చేర్చల ఫలితంలో తన బాధ్యత కొంతవరకేఅంటూ ముషారఫ్ వ్యాఖ్యానించడం విశేషం. ఆగ్రాలో జరిగే శిఖరాగ్రసదస్సు ఒకవేళ సత్ఫలితాలు సాధించకపోయినా ఆ నింద తనపైకి రాకుండా ముషారఫ్ ముందు జాగ్రత్తకోసమే ఇలా వ్యాఖ్యానిస్తున్నారని దౌత్య రంగ నిపుణులు చెబుతున్నారు.