దేశం తరపున రోజా ఎన్నికల ప్రచారం
అనంతపురంః సంస్థాగత ఎన్నికలలో సైతం సినీతారలు తళుక్కు మంటున్నాయి. ఇంత వరకుఅసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకే పరిమితమైన సినీతారల ప్రచారపర్వం ఈ సారి స్థానిక ఎన్నికలకు సైతం విస్తరించడంవిశేషం. ప్రముఖ సినీనటి రోజా ఆదివారం అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. మూడు మండలాల్లో రోజా విస్తృతంగా పర్యటించారు.
కాంగ్రెస్ పార్టీకి చెప్పుకొనేందుకు ఒక్క మంచి పని కూడా లేదనిఅందుకే తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తిపోయడమే పనిగాపెట్టుకున్నదని ఆమె విమర్శించారు. ధాటిగా మాట్లాడలేక పోయినా కాంగ్రెస్ పార్టీపై ఆమెవిసిరిన విసుర్లు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రోజాకు దీటుగా కాంగ్రెస్ పార్టీ ఏ సినీ తారను రంగంలోకి దించుతుందో వేచి చూడాలి.
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడుకు
అత్యంత
సన్నిహితుడు,
రాష్ట్ర
సమాచార
శాఖ
మంత్రి
శివప్రసాద్
కు
సినీ
నటి
రోజా
అత్యంత
సన్నిహితురాలైనవిషయం
విదితమే.