వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
11జిల్లాల్లో ముగిసిన ప్రచార హోరు
హైదరాబాద్ః స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈ నెల 12న ఎన్నికలు జరిగే 11 జిల్లాలలో ప్రచారం ముగిసింది. 11 జిల్లాలోని 520 జడ్.పి.టి.సి.లకు, సుమారు 7 వేల ఎం.పి.టి.సి.లకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఆసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ తేదీకి 24 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. అయితే స్థానిక ఎన్నికల్లో 48 గంటల ముందే ప్రచారం ముగించాలి. దీనితో ప్రచారం ముగిసే 11 జిల్లాలలో సోమవారం అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచార భేరి మోగించాయి.
మిగిలిన 11 జిల్లాల్లో ఈ నెల 14న స్థానిక ఎన్నికలు జరుగుతాయి. గురువారం పోలింగ్ జరిగే జిల్లాలలో భారీ బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాకి మాధవరావు చెప్పారు.
Comments
Story first published: Monday, July 9, 2001, 23:53 [IST]