తెలుగుదేశం అధికార దుర్వినియోగం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత హేయమైన పద్దతిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని పిసిసి నేత సత్యనారాయణరావు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు చట్టాన్ని పక్కనబెట్టి తెలుగుదేశం ప్రయోజనాలకు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు.
అనేక మంది అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు పురమాయింపుపై నిర్లజ్జగా తెలుగుదేశం కార్యకర్తల స్థాయిలో పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగితే కాంగ్రెస్ విజయభేరి మోగించడం ఖాయమని ఆయన ప్రకటించారు. అయితే ఎన్నికలు సజావుగా సాగితే పరాజయం తథ్యమని తెలిసిన తెలుగుదేశం నేత అధికారదుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు ఆయన వెల్లడించారు.
కేంద్రంలో
ఎన్డిఎ
అండ
వుండటంతో
తెలుగుదేశం
ప్రభుత్వం
చెలరేగిపోతున్నదని
ఆయన
పేర్కొన్నారు.
తెలుగుదేశం
అధికార
దుర్వినియోగానికి
అడ్డుకట్టవేసే
వారు
లేకుండా
పోయారని
ఆయన
అన్నారు.