హైదరాబాద్లోఎటిఎమ్ల వెల్లువ
హైదరాబాద్:కొత్త తరం ప్రైవేట్ బాంకుల ప్రవేశంతో ఆంధ్రప్రదేశ్రాజధానిలో బ్యాంకింగ్ స్వరూపమే మారిపోయింది.పోటాపోటీగా నెట్వర్క్ విస్తరణకు ఈ బాంకులుసాగిస్తున్న ప్రయత్నాలతో హైదరాబాద్లోని అన్నిప్రధాన ప్రాంతాల్లో ఎటిఎమ్ల హడావుడికనిపిస్తున్నది. నెట్వర్క్ విస్తరించడంతో పాటుటెక్నాలజీని ఉపయోగించుకుని కస్టమర్ల సర్వీసుకుఈ కొత్త బ్యాంకులు శతప్రయత్నాలు చేస్తున్నాయి.
బ్రాంచిబ్యాంకింగ్నునిరుత్సాహపర్చి సాధ్యమైనంత మేర ఎటిఎంలద్వారానే పనులు చెక్కబెట్టుకునేలా ప్రొత్సహించడానికివీలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి,గ్లోబల్ ట్రస్ట్, యుటిఐ బాంకులు ఎటిఎమ్లఏర్పాటులో ముందంజలో వుండగా ప్రభుత్వరంగ సంస్థల బాంకులు కూడా తామేమాత్రం తీసిపోలేదన్నట్టుగాముఖ్యమైన శాఖల చెంతనే అలంకాల ప్రాయంగాఎటిఎమ్లను ప్రారంభించి, ఐటిపై తమ అభినివేశాన్నిచాటుకుంటున్నాయి.
హైదరాబాద్లోఐసిఐసిఐ ఎటిఎమ్ల ఏర్పాటులు అన్ని బాంకుల కంటేముందంజలో వుంది. నగరంలో ఐసిఐసిఐకి ఎనిమిదిశాఖలు వుండగా 38 ఎటిఎంలు వున్నాయి. మరికొన్నిప్రాంతాల్లో కూడా ఎటిఎంల ప్రతిపాదన వున్నట్టుఐసిఐసిఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా యుటిఐ బ్యాంక్కునగరంలో నాలుగు శాఖలు వుండగా 28 ఎటిఎంలువున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్కు ఏడు శాఖలు16 ఎటిఎంలు వున్నాయి. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్కు15 శాఖలు 28 ఎటిఎంలు వున్నాయి.