వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విందుకు హురియత్ కు అహ్వానం
న్యూఢిల్లీః ముషారఫ్ రాక సందర్భంగా తాను ఇచ్చే తేనీటివిందులో పాల్గొనాల్సిందిగా హురియత్ నేతలకు భారత్ లో పాక్ హైకమిషనర్ ఆహ్వానాలుపంపారు. హురియత్ నేతలతో ముషారఫ్ చర్చలు జరపడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించినవిషయం విదితమే. ఈ వ్యవహారం ఇప్పటికేవివాదాస్పదంగా మారింది.
తమందరికీ ఆహ్వానం అందిందని హురియత్ నేతలు సోమవారం ప్రకటించారు. శిఖరాగ్ర చర్చలకు తమను ఆహ్వానించకపోవడం పట్ల హురియత్ నేతలు అభ్యంతరం తెలిపారు. భారత్ ఇప్పటికైనా వైఖరి మార్చుకొని తమను చర్చలకు ఆహ్వానించగలదని హురియత్ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్ లోని పాక్ హై కమిషనర్ ను హురియత్ నేతలు సోమవారం కలుసుకొని చర్చలు జరిపారు.
హురియత్ నేతలను టీ పార్టీకి ఆహ్వానించడాన్ని భారత్ ఖండించింది. భారత్ అభిమతాన్ని పాక్ గౌరవించకపోవడంవిచారకరమని భారత్ దౌత్య అధికారులు అన్నారు.
Story first published: Monday, July 9, 2001, 23:53 [IST]