సచిన్ లేని భారత్ క్రికెట్ జట్టు
న్యూఢిల్లీః ఈ నెల 19 నుంచి శ్రీలంక-న్యూజిల్యాండ్-భారత్ మధ్య జరిగే ట్రయాగ్యులర్ సిరీస్ జట్టుకు మాస్టర్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండుల్కర్ ను దూరంగా వుంచారు. సచిన స్థానంలో వన్డే ఓపెనర్ గా అమెయ్ ఖురేసియాను ఎంపిక చేశారు. ఇంతకు ముందు వన్డేటీమ్ లో వున్న హర్వీందర్ సింగ్, దినేష్ మోంగియాలకు ఈసారి ఉద్వాసన పలికారు. శ్రీలంకలో జరిగే ఈ ట్రయాంగ్యులర్ సిరీస్ ఈ నెల 19 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతుంది.
జింబాంబ్వేలో జరిగిన ట్రయాంగ్యులర్ సిరీస్ లో నాలుగు లీగ్ మ్యాచ్ లు గెలిచి,ఫైనల్ లో భారత్ చతికిల పడిన విషయంవిదితమే. సచిన్ అవుటైతే భారతజట్టు చతికిల పడిపోతుందనడానికి ఈ నెల 7 న విండీస్ తో జరిగినఫైనల్స్ నిదర్శనం. అటువంటిది పటిష్ఠమైన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లను సచిన్ లేకుండా భారత్ ఏ విధంగా ఎదుర్కుంటుందో చూడాలి.
సచిన్ పాదానికి గాయం తగిలినందువల్ల అతనికి రెండు వారాల విశ్రాంతి అవసరమనిసెలక్షన్ బోర్టు ఛైర్మన్ చందూబోర్డే చెప్పారు. ట్రయాంగ్యులర్ సిరీస్ తరువాత జరిగేటెస్ట్ సిరీస్ కు సచిన్ రెడీగా వుంటాడని కూడా ఆయన చెప్పారు. వరస వన్డేలతో అలిసిపోయిన తనకు విశ్రాంతి కావాలంటూ సచిన్ అభ్యర్థించడంతో అతనికి కొద్ది రోజులు విశ్రాంతి ఇచ్చారని క్రికెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రయాంగ్యులర్
వన్డే
సిరీస్
కు
భారత్
జట్టుః
సౌరభ్
గంగూలీ(కెప్టెన్),
రాహుల్
ద్రావిడ్(వైస్
కెప్టెన్)వి.వి.ఎస్.
లక్ష్మణ్,
హేమాంగ్
బదాని,
ఆశిష్
నెహ్రా,
హర్భజన్సింగ్,
జహీర్
ఖాన్,
అజిత్
అగార్కర్,
వీరేంద్ర
సెవాగ్,
రితేందర్
సింగ్
సోధి,
సమీర్
ఢిఘే,
దేవశిష్
మొహంతి,
రాహుల్సంఘ్వి,
యువరాజ్
సింగ్,
అమయ్
ఖిరేశియా.