గోడ కూలి బాలుని దుర్మరణం
హైదరాబాద్: హైదరాబాద్లోని పాతబస్తీలో గోడకూలిన సంఘటనలో ఒక బాలుడు దుర్మరణం పాలుకాగా మరో ఆరుగురు చిన్నపిల్లలు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా వుంది. ఆదివారం నాడు కురిసిన వర్షానికి తడసిన ఈ గోడ కూలినట్టుగా స్థానికులు చెప్పారు.
గోడ బలహీనంగా వున్న విషయం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చనే విషయం ఇంటి యజమానికి, మున్సిపాల్టీ అధికార్లకు తాము గతంలో అనేక సార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. బాలుని దుర్మరణం దరిమిలా ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సంఘటన గురించి తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన మున్సిపాల్టీ సిబ్బంది సగం కూలిన గోడను పూర్తిగా కూల్చివేయడం చూసిన స్థానికులు దొంగలు పడిన ఆరునెల్ల తర్వాత......... అని దుయ్యబట్టారు.
గత
నెలలలోనే
బంజారాహిల్స్లో
వర్షం
దెబ్బకు
ఒక
ఇంటి
ప్రహరీ
గోడ
కూలి
ఆరుగురు
దుర్మరణం
పాలైన
సంఘటనను
నగర
ప్రజలు
మర్చిపోక
ముందే
గోడకూలో
మరో
పసిబాలుడు
మరణించడం
నగరంలో
మున్సిపల్
నిర్వహణలో
అసమర్ధతకు
నిలువెత్తు
నిదర్శనమని
అంటున్నారు.