వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రానున్నవి చీకటి రోజులుః వై.ఎస్.
రంగారెడ్డిః సంస్థాగత ఎన్నికలు ముగిసిన వెంటనే రైతులకు ఇచ్చేవిద్యుత్ ఛార్జీలను, సబ్సిడీ బియ్యం ధరలను కూడాపెంచాలని తెలుగుదేశం ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నదని వై.ఎస్. రాజశేఖర రెడ్డివిమర్శించారు. దొరికిన చోటల్లా అప్పులు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలకువిజ్ఞప్తి చేశారు. ఇవాళ కాకపోతే రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఉచితంగావిద్యుత్ సరఫరా చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందని వై.ఎస్. ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
Comments
Story first published: Monday, July 9, 2001, 23:53 [IST]