వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలివిడత పోలింగ్‌ భారీ సన్నాహాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః 11 జిల్లాలలో గురువారం జరిగే తొలివిడత సంస్థాగత ఎన్నికల పోలింగ్‌ కు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ 11 జిల్లాలలో మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. తొలివిడతగా గుంటూరు, నెల్లూరు,విశాఖపట్నం, పశ్చిమగోదావరి, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, చిత్తూరు,శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నవిషయం విదితమే.

ఈ జిల్లాలోని 520 జడ్‌.పి.టి.సి, 6,821 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 48,300 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు మండల కేంద్రాలకు పోలింగ్‌ బాక్స్‌ లను తరలించామని, బుధవారం సాయంత్రం నుంచి వాటిని పోలింగ్‌ బూత్‌ లకుతరలిస్తామని అధికారులు వివరించారు.

లక్షమందికి పైగా రక్షణ సిబ్బందిః డిజిపి
ఈ నెల 12, 15 తేదీలలో రెండు విడతలుగా జరిగే సంస్థాగత ఎన్నికల్లో లక్ష మంది చొప్పున భద్రతా సిబ్బందిని వినియోగించనున్నట్లు డిజిపి హెచ్‌.జె.దొర వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పోలీసులను రప్పిస్తున్నట్లు ఆయనవివరిచారు. సున్నిత ప్రాంతాలలో వుండే పోలీసు బృందాలకు వైర్‌లెస్‌ సెట్లు కూడా ఇచ్చనట్లు ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X