పొసగని పొత్తు ఇద్దరికీ చేటు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడే ముందువరకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన తెలుగుదేశం, బిజెపి పార్టీల మధ్య ఎన్నికల సమయానికి పొత్తు పొసగకపోవడంతో అనేక చోట్ల కయ్యానికి దిగాయి. ఈ పరిస్థితికి తెలుగుదేశం కారణమని బిజెపి, బిజెపి కారణమని తెలుగుదేశం దుయ్యబడుతున్నాయి.
పొత్తు కుదిరిన చోట ఎదుటిపక్షానికి మద్దతు ఇస్తూ పొత్తు కుదరని చోట మాత్రం రెండు పార్టీలు కయ్యానికి కాలుదువ్వాయి. పొసగని పొత్తుకు కారణాలు ఏవైనా ఈ పరిస్థితి రెండు పక్షాలకు నష్టం చేస్తుందని రెండు పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు. అయితే ఇది కూడా ఒకందుకు నయమేనని ఎవరిబలమెంతో ఈ దెబ్బతో తెలుస్తుందనే నాయకులు కూడా వున్నారు. ఈ పార్టీలు కనీసం 165 జెపిటిసి స్థానాలకు పోటీపడుతున్నాయి. ఈ రెండు పార్టీలు పోటీలో వున్నచోట్ల మూడో పక్షమే లాభపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా, పోలయ్యే ఓట్లను బట్టి తమ బలాన్ని అంచనావేసుకునేందుకు రెండు పార్టీలు సిద్ధంగా వున్నాయి.
బిజెపి
తన
బలాన్ని
అతిగా
అంచనావేసుకున్నదని
వాస్తవ
పరిస్థితులకు
అనుగుణంగా
సీట్ల
సర్ధుబాటుకు
తాము
చేసిన
ప్రయత్నాలు
బిజెపి
మొండితనం
వల్ల
దెబ్బతిన్నాయని
తెలుగుదేశం
నేత
చంద్రబాబు
పేర్కొన్నారు.
కాగా
తెలుగుదేశం
అధికార
పార్టీనన్న
అహంతో
వ్యవహరించిందని
పట్టువిడుపులు
లేకుండా
వ్యవహరించిందని
బిజెపి
నేతలు
దుయ్యబట్టారు.
తెలుగుదేశం
పార్టీ
తమను
మోసం
చేసిందని
బిజెఎల్పి
నేత
ఇంద్రసేనారెడ్డి
ఆరోపించారు.