గులాబీ కార్డులపైనాగ్యాస్ కనెక్షన్లు: బాబు
నల్లగొండ: గులాబీ కార్డులున్న కుటుంబాలకు కూడాదీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు సూచనప్రాయంగాచెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ఈవిషయాన్ని ప్రకటించలేకపోతున్నానని ఆయనఅన్నారు. మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లాలోనిహుజూర్నగర్, సూర్యాపేట, నకిరేకల్, నార్కెట్పల్లిలలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లోఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఇప్పటికే 15 లక్షలగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని, మరో 15 లక్షల కనెక్షన్లుఇటీవలే మంజూరు చేశామని ఆయనచెప్పారు. పేద మహిళలందరికీ గ్యాస్ కనెక్షన్లు అందేవరకు దీపం పథకం కొనసాగుతుందని ఆయనచెప్పారు.
నల్లగొండ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గత ఆరేళ్ల తెలుగుదేశం పాలనలో అభివృద్ధిజరిగిందని చంద్రబాబు అన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టునుంచి వచ్చే ఆగస్టులో నీటిని విడుదల చేస్తామనిఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో మంచినీటి సమస్య తీవ్రంగావున్నదని, దీన్ని పరిష్కరించేందుకు వంద కోట్లరూపాయలు విడుదల చేశామని, నాబార్డు ద్వారామరో రూ.130 కోట్లు ఖర్చు చేస్తామని ఆయనచెప్పారు. అధికార వ్యామోహంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితిపంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల తర్వాత కనుమరుగవుతుందనిఆయన అన్నారు. వామపక్షాలకు ఓటు వేసి ఓటును వృధాచేసుకోవద్దని ఆయన అన్నారు.