హైదరాబాద్ లో పాతఇళ్ళు నేలమట్టం
హైదరాబాద్ః జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లలో శిధిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేయాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. ఈ కూల్చివేతలపర్వాన్ని గురువారం నుంచి అధికారులు ప్రారంభించనున్నారు. నగరంలో వున్న అతి పురాతన భవనాలు వర్షాకాలంలో కూలిపోతూ....పలువురి ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇటువంటి ప్రమాదాలను నివారించేందుకు గానుఎం.సి.హెచ్. అధికారులు నివాసయోగ్యం కాని పురాతన ఇళ్ళను గుర్తించారు.
జంటనగరాలలోని మొత్తం 7 సర్కిళ్ళలో ఇప్పటి వరకు 126 పురాతన గృహాలను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు పంపినట్లు అధికారులువివరించారు. నగరంలోని 811 మురికివాడల్లో కూడా బలహీనంగా వున్న ఇళ్ళను గుర్తించామని, వాటని కూడా కూల్చివేసేందుకుఎం.సి.హెచ్. ప్రయత్నాలు చేస్తున్నదని అధికారులువివరించారు. ఎం.సి.హెచ్. చేపట్టిన కూల్చివేతలపర్వంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నది.