టీ పార్టీకి ఎన్డిఎ దూరం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అధినేత జనరల్ ముషారఫ్ భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ ఏర్పాటు చేస్తున్న తేనీటి విందును బహిష్కరించాలని ఎన్డిఎ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. బుధవారం నాడు ప్రధాని వాజ్పేయి నివాసంలో ఆయన అధ్యక్షతన ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముషారఫ్ పర్యటనకు సంబంధించిన వివిధ పరిణామాలపై చర్చించారు.
ముషారఫ్ గౌరవార్ధం ఏర్పాటు చేస్తున్న తేనీటి విందుకు హురియత్ కాన్ఫరెన్స్ నేతలను ఆహ్వానించడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాకిస్తాన్ లెక్కచేయకపోవడం పట్ల ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సమావేశంలో భాగస్వామ్య పార్టీల నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా తేనీటి విందును బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీర్కు సంబంధించిన ఇతర పార్టీలను విస్మరించి కేవలం హురియత్ను ఆహ్వానించడంలో మర్మమేమిటని ఎన్డిఎ నేతలు ప్రశ్నించారు.
తేనీటి విందుకు హాజరయ్యే విషయం ఆయా పార్టీల యిష్టాయిష్టాలకే వదిలిపెడుతున్నట్టుగా ప్రధాని వాజ్పేయి తొలుత ప్రకటించిన శివసేన వంటి పార్టీలు ఈ విషయంలో తీవ్రమైన పట్టుదల చూపినట్టుగా తెలిసింది. కాగా ముషారఫ్ పర్యటన విషయంలో ఎన్డిఎ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శివసేన బుధవారం ఢిల్లీలో ర్యాలీ నిర్వహించింది. కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలను పాక్కు సమర్పించుకోవడానికి కూడా వాజ్పేయి సిద్ధంగా వున్నట్టు కనిపిస్తున్నారని శివసేననేతలు ఆరోపించారు.
కాంగ్రెస్
హాజరు
కాగా
కాంగ్రెస్
తేనీటి
విందుకు
హాజరుకావాలని
నిర్ణయించింది.
శిఖరాగ్ర
చర్చల్లో
పాల్గొనే
అధికారం,
చట్టబద్దత
హురియత్కు
లేవని
కాంగ్రెస్
అంటున్నది.
కాశ్మీర్
పై
చర్చలకు
హురియత్ను
ఒక
భాగస్వామిగా
గుర్తించనంతవరకు
టీపార్టీకి
హురియత్
హాజరుకావడం
వల్ల
నష్టమేమీ
లేదని
కాంగ్రెస్
పేర్కొంది.
టీపార్టీకి
హాజరయ్యే
అనేక
పక్షాల్లో
హురియత్ను
ఒకటిగా
మాత్రమే
తాము
చూస్తామని
కాంగ్రెస్
ప్రతినిధి
ప్రణబ్
ముఖర్జీ
చెప్పారు.