వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంచాయతీలు ప్రగతికి సోపానాలు
న్యూఢిల్లీ: పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చి ఎన్ని దశాబ్దాలు గడిచినా స్థానిక సంస్థలకు అధికారాలు నిధులబదలాయింపు విషయంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చొరవ తీసుకోవడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం నాడు ఢిల్లీలో వివిధ రాష్ట్రాల పంచాయతీ రాజ్ శాఖ మంత్రుల సదస్సులో ఆయన ప్రసంగించారు. పంచాయతీ సంస్థలు ఎన్నికలు ముగిసిన తర్వాత వాటి నిర్ధిష్ట కాలపరిమితి ముగిసేవరకు పనిచేసేలా చర్యలు తీసుకోవల్సిన అవసరం వున్నదని ఆయన ప్రకటించారు. ఉత్తమ పంచాయతీలకు నగదు బహుమతులతో ప్రోత్సాహం అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టమైతేనే దేశ ప్రగతిని అట్టడుగు స్థాయినుంచి తీర్చిదిద్దవచ్చని ఆయన చెప్పారు.
Story first published: Wednesday, July 11, 2001, 23:53 [IST]