వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్‌కు సన్నద్ధం-జోరుగా ప్రచారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో జెడ్‌పిటిసి, ఎంపిటిసి స్థానాలకు తొలివిడత జరుగనున్న పోలింగ్‌కు అధికారయంత్రాంగం సమాయత్తమైంది. మరోవైపు మలివిడత పోలింగ్‌ జరుగనున్న ప్రాంతాల్లో ప్రచారం పతాకస్థాయికి చేరింది. గురువారం నాడు తొలివిడత పోలింగ్‌ జరుగనున్న 11 జిల్లాల్లో పోలింగ్‌ సాఫిగా సాగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

సమస్యాత్మకంగా గుర్తించిన 6625 గ్రామాల్లో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు. సుమారు 75 వేల మంది పోలీసులను మొహరించారు. కాగా మలివిడత 15వ తేదీన పోలింగ్‌ జరుగనున్న జిల్లాల్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌, బిజెపి, టిఆర్‌ఎస్‌ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. పేరుకు మిత్రపక్షాలైనప్పటికీ ఈ ఎన్నికల్లో అనేక చోట్ల బిజెపి, తెలుగుదేశం పార్టీలు పోటీపడుతున్నాయి. తెలంగాణేతర ప్రాంతాల్లో బిజెపి తెలుగుదేశం పొత్తు వున్న చోట్ల ద్విముఖ పోటీ, లేని చోట త్రిముఖ పోటీ వుండగా, తెలంగాణాలో ఈ రెండు పార్టీలు కత్తు కలిపిన చోట త్రిముఖం లేని చోట్ల చతుర్మఖ పోటీ చేస్తున్నాయి.

రెండు నెలల క్రితమే పుట్టుకువచ్చిన టిఆర్‌ఎస్‌ తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షాల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. పైకి బింకంగా వున్నప్పటికీ టిఆర్‌ఎస్‌ ప్రభావాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి.
గురువారం నాడు తొలివిడత పోలింగ్‌ ఉదయం ఏడు గంటలనుంచి సాయంత్రం అయిదుగంటల వరకు సాగుతుంది. పోలింగ్‌ సిబ్బంది బుధవారం నాడే పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. మొత్తం 509 జెపిటిసి, 6821 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు తొలివిడత పోలింగ్‌లో జరుగుతున్నాయి. ఎన్నికల అధికారుల రిపోర్టులను బట్టి అవసరమైన కేంద్రాల్లో 13న రీపోలింగ్‌ నిర్వహిస్తారని రాష్ట్ర ఎన్నికల అధికారి కాకి మాధవరావు చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాల అధికారులతో ఎన్నికల కమిషన్‌ చర్చలు జరిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X