వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరులో బాంబు దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరుః ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా గుంటూరులో గురువారం నాడు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లావీరఘట్టం, రొంపిచర్ల లలో తెలుగుదేశం- కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బాంబు దాడులకు దిగాయి. రొంపిచర్ల పోలీస్టేషన్‌ కు సమీపంలో కొందరు అగంతకులు బాంబులు విసరడంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలతో నరసరావుపేట ఎమ్మెల్ల్యే కోడెల శివప్రసాద్‌, మాజీఎం.పి. కాసు కృష్ణా రెడ్డిలను ఇళ్ళ నుంచి బయటకు రావద్దంటూ పోలీసులకోరారు.

రెంటచింతల సమీపంలో తెలుగుదేశం- కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరిస్థితి చేయి దాటి పోవడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు.అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాలిలోకి కాల్పులు జరిపి అల్లరి మూకలను చెదర గొట్టారు.మిగిలిన మండలాలలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నట్లు సమాచారంఅందింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X