వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనేక అంశాల్లో కాశ్మీర్‌ ఒక్కటి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని ఆ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా భారత్‌ ఆగ్రా శిఖరాగ్ర సభలో చర్చించాల్సింది ఏమీ లేదని కేంద్ర విదేశాంగ మంత్రి జస్వంత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. గురువారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆగ్రా శిఖరాగ్ర సభలో ప్రధానాంశం కాశ్మీరేనంటూ ప్రచారం చేస్తున్న పాకిస్తాన్‌కు ఆయన గట్టిగా సమాధానం చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌లో ప్లెబిసైట్‌ ఊసును ఎత్తడానికి కూడా భారత్‌ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. ప్లెబిసైట్‌ను నిర్వహించాలంటే ముందుగా జమ్మూకాశ్మీర్‌ ఆక్రమిత భూభాగం నుంచి పాకిస్తాన్‌ బలగాలు పూర్తిగా వైదొలగాలని ఆ రాష్ట్రంపై భారత్‌కు పూర్తిగా పాలనా పరమైన పట్టు లభించాలని జస్వంత్‌ అన్నారు. ఆ తర్వాతే ప్లెబిసైట్‌ ప్రస్తావన వస్తుందని ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్‌ గురించి శిఖరాగ్ర సభలో ముషారఫ్‌ ప్రస్తావిస్తే చర్చించడానికి భారత్‌
సిద్ధంగా వున్నదని అయితే ఆ సమస్యపై నిర్ధిష్టప్రతిపాదనలను మాత్రం భారత్‌ తయారు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

ఆ అవసరం భారత్‌కు లేదని ఆయన అన్నారు. ఆగ్రా శిఖరాగ్ర చర్చల ఫలితాలు చర్చల సరళిని బట్టి వుంటాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌ రాయబారి ఏర్పాటు చేసిన టీపార్టీకి జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వ నేతలను ఆహ్వానించకుండా వేర్పాటువాద పక్షాలను ఆహ్వానించడం వల్లనే టీపార్టీని బహిష్కరించాలని ఎన్‌డిఎ కూటమి పార్టీలు నిర్ణయించాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X