వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

xహురియత్‌ నేతల గృహనిర్బంధం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: భారత్‌ పాక్‌ శిఖరాగ్ర చర్చల సందర్భంగా భారత వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించే అవకాశం వున్నందున కాశ్మీర్‌ వేర్పాటు వాద నాయకులను ప్రభుత్వం గృహనిర్బంధంలో వుంచింది. ఆల్‌పార్టీ హురియత్‌ కాన్ఫెరన్స్‌ నేత అబ్దుల్‌ గనీ లోన్‌ను శుక్రవారం నుంచి గృహనిర్బంధంలో వుంచుతున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

శ్రీనగర్‌లోని హురియత్‌ ప్రధానకార్యాలయంలో లోన్‌ శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో ప్రసంగించాల్సివుండగా ఈ సమావేశానికి ముందుగా ఆయన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఇదిలా వుండగా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హురియత్‌ పిలుపు మేరకు కాశ్మీర్‌లో పలు చోట్ల బంద్‌ జరిగింది. 1931లో అప్పటి మహరాజ హరిసింగ్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించిన 36 మంది కాశ్మీరీల మృతికి సంతాపంగా ప్రతిఏటా అమరవీరుల దినం జరుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X