అమెరికా ఒత్తిడిలేదు: వాజ్పేయి
న్యూఢిల్లీ: అమెరికా ఒత్తిడిమేరకే తాను పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషరాఫ్నుచర్చలు ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలను భారత ప్రధానిఅటల్ బిహారీ వాజ్పేయి తోసి పుచ్చారు. అమెరికా కూడా ఇదేవిషయాన్ని స్పష్టం చేసిందని పాకిస్థాన్ ఉర్దూ పత్రికజంగ్, ఇంగ్లీష్ పత్రిక ది న్యూస్ పత్రికలకు ఇచ్చినఇంటర్వ్యూలో ఆయన అన్నారు. భారతదేశం ముషరాఫ్నుచర్చలకు ఆహ్వానించడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అమెరికా వ్యాఖ్యానించిందని ఆయనచెప్పారు.
పాకిస్థాన్కు చైనా సైనిక సహాయాన్నిఅందిస్తుండడంతో దాన్ని అడ్డుకునేందుకు తానుముషరాఫ్ను ఆహ్వానించానన్న వాదనను ఆయనఖండించారు. ముషరాఫ్కు ఆహ్వానం పలకడంలోచైనా ప్రభావం ఏమీ లేదని ఆయన చెప్పారు.భారత్-చైనాల మధ్య సంబంధాలు కూడామెరుగవుతున్నాయని ఆయన అన్నారు. దక్షిణాసియాలో శాంతిసాధనకు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికితాము వెనుకాడబోమని ఆయన అన్నారు.
భారత్, పాక్లు సంకుచిత, పురాతన ధోరణులను విడనాడి ఉభయదేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసికెళ్లడానికి కృషిచేయాలని, రెండు దేశాలకు ఆందోళన కలిగిస్తున్న సమస్యలను పరిష్కరించుకోవాలనిఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్యస్నేహం కోసమే తాను ముషరాఫ్ను ఆహ్వానించాననిఆయన పాకిస్థాన్ అధికార వార్తా సంస్థ ఎపిపికిచ్చినఇంటర్వ్యూలో అన్నారు.