మలిదశ పోలింగ్కు ఏర్పాట్లు
హైదరాబాద్: మలి దశ స్థానిక సంస్థల ఎన్నికలకుఅధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా,మండల ప్రాదేశిక కమిటీల (జడ్పిటిసి,ఎంపిటిసిల) ఎన్నికల పోలింగ్ ఈ నెల 15వ తేదీనజరుగనుంది. తొలి విడత పోలింగ్ గురువారంనాడుజరిగింది. తొలి విడత పోలింగ్ జరిగిన 31 చోట్ల శనివారం రీపోలింగ్ జరుగుతుంది.మలి విడత పోలింగ్ జరిగే రాయలసీమ, తెలంగాణప్రాంతాల్లో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా వుండడంతో భద్రతాఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రచారానికి శుక్రవారంఉదయం ఏడు గంటలకు తెర పడింది. దీంతో ఓటర్లను తమవైపు లాక్కునేందుకు ప్రధాన పార్టీలు తమప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
మలి విడత 540 జడ్పిటిసిలకు, ఏడువేలకు పైగా ఎంపిటిసిలకు పోలింగ్ జరుగుతుంది. కోటీ 80 లక్షలమందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్సిబ్బంది శుక్రవారం జిల్లా కేంద్రాలకుచేరుకుంది. శనివారం మండల కేంద్రాలకుచేరుకుంటుంది. తొలి విడత పోలింగ్ సందర్భంగాచెదురు మొదురు సంఘటనలు జరిగిన నేపథ్యంలోమలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులుకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేస్తున్నారు.