న్యూఢిల్లీ: విదేశీ అతిధులు వచ్చినప్పుడు పాటించే కచ్చితమైన ప్రోటోకాల్ నిబంధనలను పక్కనబెట్టి పాక్అధినేత ముషారఫ్ విషయంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అనీల్ యశ్వంత్ టిప్నిస్ వ్యవహరించిన తీరుపై అధికారవర్గాల్లో పెద్దఎత్తున చర్చజరుగుతున్నది.
శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్లో పాక్ అధినేత సంప్రదయ సైనికవందనం స్వీకరించే సందర్భంగా త్రివిధ దళాల ప్రతినిధిగా ఈ స్వాగతకార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ చీఫ్మార్షల్ టిప్నిస్ పాక్ అధినేత ముషారఫ్కు సాల్యూట్ చేయకుండా సింపుల్గా షేక్ హాండ్ ఇచ్చారు. భారతీయుల హృదయాలను ఈ మధ్య కాలంలో తీవ్రంగా కలిచివేసిన కార్గిల్ పోరు రూపశిల్పిగా భావిస్తున్న పాక్ నేత ముషారఫ్ విషయంలో భారత సైనికదళాల ప్రతిస్పందన ఏవిధంగా వుంటుందనే అంశంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్న సమయంలో టిప్నిస్ ప్రతిస్పందన విశేష ప్రాధాన్యత సంతరించుకున్నది.
గతంలో ప్రధాని వాజ్పేయి పాకిస్తాన్ సందర్శించినప్పుడు అప్పట్లో పాక్ సైనిక దళాల ప్రధాన అధికారిగా వున్న ముషారఫ్ ఆయనతో పాటు వైమానిక, నౌకాదళాధిపతులు వాగ్ సరిహద్దు ప్రాంతానికి రాకుండా తప్పించుకున్నారు. వాజ్పేయికి సాల్యూట్ చేయాల్సివస్తుందనే అప్పట్లో పాక్ త్రివిధ బలగాల అధికారులు మొహం చాటేశారని వార్తలు వచ్చాయి. అప్పటి అవమానానికి ప్రతీకారంగానా అన్నట్టుగా త్రివిధ బలగాల ఛీప్గా వున్న ఆర్మీ జనరల్ పద్మనాభన్ను కాకుండా సైనికవందనం కార్యక్రమానికి టిప్నిస్ను ప్రతినిధగా ఎంపిక చేశారు. టిప్నిస్ కూడా ముషారఫ్కు సాల్యూట్ చేయకుండా తప్పించుకున్నారు.
ఇదిలా
వుండగా
త్రివిధ
దళాల
గౌరవవందనం
స్వీకరించే
సందర్భంగా
జనరల్
ముషారఫ్కు
ఎస్కార్ట్గా
వుండేందుకు
కమ్యూనికేషన్స్
స్క్వాడ్రన్కు
చెందిన
ఆరడుగుల
ఆజానుబాహుడు
వింగ్కమాండర్
పవన్
రిషిని
ఎంపిక
చేశారు.
గౌరవవందనం
చివరలో
ఎస్కార్ట్
వెనుతిరిగే
సమయంలో
వింగ్కమాండర్
సాల్యూట్ను
స్వీకరించడానికి
ముషారఫ్
తలెత్తి
పైకి
చూడాల్సివుంటుందని
అందువల్లనే
ఈ
ఆరడుగుల
అధికారిని
ఎంపిక
చేశారని
గుసగుసలు
వినిపింస్తున్నాయి.