వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హురియత్‌పైజెకెఎల్‌ఎఫ్‌ గరం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పాకిస్తాన్‌ అగ్రనేత ముషారఫ్‌తో హురియత్‌నేతల భేటీని జెకెఎల్‌ఎఫ్‌ తీవ్రంగాఖండించింది. భారత్‌, పాకిస్తాన్‌తో పాటు కాశ్మీర్‌ప్రజల ప్రమేయం లేకుండా కాశ్మీర్‌ సమస్యపైజరిగే ఏలాంటి చర్చలనైనా తామువ్యతిరేకిస్తామని జెకెఎల్‌ఎఫ్‌ ప్రకటించింది.హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలు తమతోచర్చించకుండా ముషారఫ్‌తో భేటీ కావడాన్నిజెకెఎల్‌ఎఫ్‌ తీవ్రంగా దుయ్యబట్టింది.

జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాద వేర్పాటు వాద సంస్థల్లోజెకెఎల్‌ఎఫ్‌ చిరకాలంగా వున్న సంస్థ. హురియత్‌భాగస్వామ్య పార్టీల్లో ఇది కూడా ఒకటి. త్వరలోనేకార్యవర్గ సమావేశం జరిపి హురియత్‌ నాయకులధోరణిపై చర్చించాలని జెకెఎల్‌ఎఫ్‌ నిర్ణయించింది.ముషారఫ్‌కు వాజ్‌పేయికి ముందుగా రాసినలేఖలో ఇద్దరు నేతలతో భేటీకిఅభ్యర్ధించామే తప్ప ముషారఫ్‌తో కాదనిజెకెఎల్‌ఎఫ్‌ నేత బషీర్‌ భట్‌ చెప్పారు.

ముషారఫ్‌తోముఖాముఖీకి నిర్ణయించిన తర్వాత తమకుమాటమాత్రం కూడా విషయం చెప్పలేదనిభట్‌ ఆరోపించారు. హురియత్‌ నేతలకుభిన్నంగా జెకెఎల్‌ఎఫ్‌ కాశ్మీర్‌కు స్వాతంత్ర్యాన్నికోరుతున్నది. కాశ్మీర్‌ విమోచన ప్రతిపాదననుకొందరు ఇష్టపడవచ్చు, కొందరు ద్వేషించవచ్చుఅయితే ఎవరూ దీనిని నిర్లక్ష్యం చేయలేరనిబషీర్‌ భట్‌ అంటున్నారు. తేయాకు, విందు దౌత్యాలపైతమకు నమ్మకం లేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X