వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనసు విప్పి మాట్లాడుకుందాం...

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌తో మనసు విప్పి మాట్లాడుకోవాలనే ఆకాంక్షతో తాను భారత్‌కు వచ్చానని, కాశ్మీర్‌ వివాదంపై అర్ధవంతమైన చర్చలు జరుగుతాయనే ఆశాభావంతోవున్నానని ఆయన ప్రకటించారు.

భారత్‌లో అధికార పర్యటనకు శనివారం నాడు ఇక్కడకు చేరుకున్న ముషారఫ్‌ గత 50 ఏళ్లుగా ఉభయదేశాల మధ్య సంబంధాలకు ప్రధాన అవరోధంగా కాశ్మీర్‌ వున్నదని అన్నారు. భారత్‌నేతలతో ఆదివారం నాడు చర్చల సందర్భంగా ఈ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుందేమో అన్వేషిస్తానని ఆయన అన్నారు.

కాశ్మీర్‌ ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి భారత నేతలు తనతో సహకరించాలని ఆయన కోరారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారమైతే ఇతర సమస్యలు కూడా పరిష్కారం మవుతాయని ఆయన చెప్పారు. ఉపఖండంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలన్నా ఉభయదేశాలు ఆర్ధికంగా పురోగమించాలన్నా కాశ్మీర్‌ సమస్యనే ప్రధాన అవరోధంగా వున్నదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X