వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో విడతకుఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలోని మరో 11 జిల్లాల్లో ఆదివారం నాడుజరుగనున్న స్థానిక సంస్థల రెండో విడతఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.రెండో విడత ఎన్నికలు జరుగుతున్నజిల్లాల్లో రాయలసీమలోని ఫాక్షనిస్ట్‌ ప్రాంతాలు,తెలంగాణాలోని నక్సలైట్‌ ప్రభావితప్రాంతాలు వుండటంతో అధికారులు ముందుజాగ్రత్తచర్యగా పెద్ద సంఖ్యలో బలగాలను రంగంలోకిదించారు.కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోపోలింగ్‌పై నక్సలైట్ల ప్రభావం వుండేఅవకాశం వున్నదని భావిస్తున్నారు. అదేవిధంగావిశాఖ ఎజెన్సీ ప్రాంతంలో అనంతపురం, ప్రకాశంజిల్లాల్లోని కొన్ని డివిజన్లలో కూడా పీపుల్స్‌వార్‌నక్సలైట్లకు పట్టు వుంది. కరీంనగర్‌లోఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తునగాలింపుచర్యలు చేపట్టారు. కాగా కడప,అనంతపురం జిల్లాల్లో పోలింగ్‌ సందర్భంగాఫాక్షనిజం పడగవిప్పే అవకాశం వున్నదని అధికారులుభయపడుతున్నారు.

అనంతపురంలోఇప్పటకే వాతావరణం ఉద్రిక్తంగా మారింది.కోస్తాంధ్రలోని ముఖ్యమైన జిల్లాల్లో ఒకటైనకృష్ణాలో కూడా శుక్రవారం నాడు పోలింగ్‌జరుగుతున్నది. తూర్పుగోదావరిలో కూడాపోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ ఎజెన్సీలోఆదిలాబాద్‌ జిల్లాల్లో వాహనాలువెళ్లడానికి అవకాశం లేని ప్రాంతాలకు పోలింగ్‌సిబ్బంది, పోలింగ్‌ సామాగ్రిని ఎడ్లబండ్లలోతరలించారు. సిఎల్‌పి నేత వైఎస్‌ స్వంతజిల్లా కడపలో ప్రచారం వరకు అంతా సవ్యంగాసాగినప్పటికీ పోలింగ్‌ సందర్భంగా హింసప్రజ్వరిల్లే అవకాశం వున్నదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X