వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భర్తకు షెబాశాంతి సందేశం
న్యూఢిల్లీ:భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో శాంతిస్థాపనను ఆకాంక్షిస్తున్న భారత్, పాకిస్తాన్మహిళల హృదయాన్ని తనదైనభాషలో తన భర్తకు చేరవేస్తాననిపాకిస్తాన్ నేత జనరల్ ముషారఫ్ అర్ధాంగిబేగం షెబా చెప్పారు. శాంతి సామరస్యాల సాధనలోమహిళలదే కీలక పాత్రమని ఆమెచెప్పారు. భారత్లో మూడు రోజుల అధికారపర్యటనకు తన భర్త పర్వేజ్ ముషారఫ్తోకలసి శనివారం నాడు ఢిల్లీ వచ్చిన షెబా,ఉభయదేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలకోసం మహిళలు చేస్తున్న కృషివృధాపోదని అన్నారు. శనివారం నాడు ఆమె దక్షిణాసియాలోశాంతికి కృషి చేస్తున్న మహిళలసంఘం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉభయ దేశాలకు చెందిన మహిళలుఉభయదేశాల మధ్య శాంతి, సామరస్యాలపైవ్యక్తం చేసిన అభిప్రాయాల పట్ల ఆమె ముగ్దురాలయ్యారు.ఈ సమావేశంలో వివిధ మహిళా సంఘాలు షెబాకువిలువైన రకరకాల బహుమతులు అందజేశారు.
Comments
Story first published: Saturday, July 14, 2001, 23:53 [IST]