వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతి మినహా మరో మార్గం లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాశ్మీర్‌ సమస్యకు మిలటరీ పరిష్కారం ఎంత మాత్రం పనికిరాదని జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి పర్వేజ్‌ ముషారఫ్‌ స్పష్టం చేశారు. శాంతియుత మార్గాల్లోఈ సమస్యను పరిష్కరించాల్సివున్నదని ఆయన అన్నారు.

భారత్‌-పాకిస్తాన్‌ సంబంధాలకు ప్రధాన అవరోధం కాశ్మీర్‌ అని ఆయన పునరుద్ఘాటించారు. కాశ్మీర్‌ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించే విషయంలో ధైర్యంగా వ్యవహరించాలని ఆయన కోరారు. శనివారం రాత్రి రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ ఏర్పాటు చేసిన విందులో ఆయన
పాల్గొన్నారు. కాశ్మీర్‌నే ప్రధాన సమస్యగా పట్టుకువేళ్లాడిన ముషారఫ్‌ విందు సందర్భంగా తనవైఖరి కొంత మార్చుకున్నారు. ఉభయదేశాల మధ్య సామరస్య పూర్వకమై సంబంధాల కోసం కృషి చేయడం అవసరమని ఆయన చెప్పారు.

ఉభయదేశాల మధ్య సంబంధాలు విస్తృతం కావాలని, వాణిజ్యం వర్ధిల్లాలని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆర్ధిక పురోభివృద్ధికోసం ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం జరుగుతున్నదని అదే ఉపఖండంలో కూడా జరగాలని ముషారఫ్‌ అన్నారు. భారత్‌-పాక్‌ భవిష్యత్‌ తరాలు నిరంతర యుద్ధ భయాల మధ్య జీవించే పరిస్థితి వుండరాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X