రాయలసీమలో భారీ హింస
అనంతపూర్ : స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా రాయలసీమలో పెద్దఎత్తున హింస చెలరేగింది. రాయలసీమలోని ఆదివారం పోలింగ్ జరిగిన కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోయింది.
అనేకచోట్ల
దుండగులు
పోలింగ్కు
అంతరాయం
కలిగించారు.
కొన్నిచోట్ల
బ్యాలెట్
బాక్సులలో
సిరాపోశారు.
కడప
జిల్లా
కమలాపూర్
మండలం
వీరపనాయునిపల్లెలో
ల్లరిమూకలనుఅదుపు
చేసేందుకు
పోలీసులు
గాలిలోకి
కాల్పులు
జరిపారు.
కడప జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోయింది. అనంతపురంలో నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలను తెలుగుదేశం వారు కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదు అందింది. కర్నూలు జిల్లాలలోని అనేక ఫ్యాక్షన్ గ్రామాలలో పోలింగ్ ఏకపక్షంగా జరిగినట్టు ఫిర్యాదులు అందాయి. రాయలసీమ జిల్లాలలో మొత్తంమీద 60 శాతం పోలింగ్ నమోదయ్యింది. కడప జిల్లాలో ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, పాలకొండరాయుడుపై దాడి జరిగింది.