వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుహృద్భావంతో ఆగ్రా శిఖరాగ్రం

By Staff
|
Google Oneindia TeluguNews

ఆగ్రాః భారత - పాకిస్తాన్‌ దేశాల మధ్య ఐదు దశాబ్దాలుగా నెలకొన్ని ఉద్రిక్తలను నివారించి సుస్థిరశాంతి స్థాపనకు నాందిగా ఆగ్రా శిఖరాగ్ర సదస్సు ఆదివారం ఆగ్రాలో సుహృద్భావ వాతావరణంలో జరిగింది. భారత ప్రధాని వాజ్‌ పేయి, పాకిస్తాన్‌ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ అరమరికలు లేకుండా సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆదివారం ఉదయం పావుగంట సేపు వాజ్‌ పేయి-ముషారఫ్‌
సమావేశం కావాల్సివుండగా ఆ సమావేశం గంటన్నరకు పైగా సాగడం విశేషం. ఆ తరువాత ఇద్దరు నేతలు అధికారుల సహకారంతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.

భోజన సమయంలో కూడా వాజ్‌ పేయి-ముషారఫ్‌ లు చర్చలు కొనసాగిస్తునే వున్నారు. ఆ తరువాత ఉభయ దేశాల నేతలు మరోసారి ముఖాముఖి సమావేశం అయ్యారు. సోమవారం నాడు కూడా చర్చలు కొనసాగిద్దామని వారిద్దరూ నిర్ణయించారు. భారత-పాకిస్తాన్‌ కు చెందిన ఉన్నతాధికార బృందాలు ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపాయి. సోమవారం చర్చలు ముగిసాక భారత-పాకిస్తాన్‌ లు ఒక ఉమ్మడి ప్రకటన చేసేఅవకాశాలున్నాయి.

  • ఆగ్రాశిఖరాగ్రం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X